26, జనవరి 2013, శనివారం

శ్రీకూర్మం ప్రత్యేకతలు

శ్రీకూర్మం ప్రత్యేకతలు
యావత్‌ భారతదేశంలో మరే ఆలయానికి లేని విశిష్టత శ్రీకాకుళం జిల్లా గార మండలం లోని శ్రీకూర్మం ఆలయానికి ఉంది. కూర్మావతారంలో విష్ణుమూర్తిని పూజించడం ఇక్కడి ప్రత్యేకత.

templeవిష్ణుమూర్తి సలహాపై దేవదానవులు క్షీర సముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని మధి స్తున్న సమయంలో ప్రతిసారీ పర్వతం సరిగా నిలువకుండా సముద్రంలో పడిపోయేది. దీం తో విష్ణుమూర్తి కూర్మావతారం దాల్చి కార్యం నిర్విఘ్నంగా ముగిసేలా చేశాడు. దశావతారా ల్లో రెండో అవతారం కూర్మావతారం. ఆలయ స్థల పురాణాన్ని అనుసరించి, శ్వేతమహీపతిని అనుగ్రహించడానికి స్వామి ముందుగా ఇక్క డకు విచ్చేశాడట.

రోగి అస్తికలను ఇక్కడి శ్వేత పుష్కరిణిలో వేయగా అందులో నీళ్ళు తాబేళ్ళు గా మారాయనీ, అందుకే అశుచి కలిగిన వా రు అక్కడి నీళ్ళను తాకకూడదన్న నిబంధన ఉంది. ఈ ఆలయం శతాబ్దాల కిందటిదని చె బుతారు. ఏడవ శతాబ్దానికి దేవాలయ వైభవం ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అనంగభీ ముడు నిర్మించిన తిరుచుట్టు మండపం స్తం భాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి, ప్రాకృత భాషల్లో శాసనాలు కనిపిస్తాయి. ఈ మండపం లో నిర్మించిన 71 నల్లరాతి స్తంభాలు గాంధా ర శిల్పకళతో అలరారుతుంటాయి. సింహాచ లం కప్పస్తంభం మాదిరిగానే ఇక్కడ ‘ఇచ్ఛా ప్రాప్తి స్తంభం’ ఉంది. దీనిని కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయని చెబుతారు. ఈ స్తంభాలపై కలంకారి రంగులతో చిత్రించిన చిత్రాలు, శిల్పాలు ఆనాటి శిల్పకళానైపుణ్యా నికి ప్రతీకగా నిలుస్తాయి.

Srikదేశంలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఇది ఒకటి. ఆలయంలో మూలవిరాట్‌ గర్భాల యంలో ఒక పక్కగా వెలసినట్లు కనిపిస్తుంది. సాధారణంగా దేవతావిగ్రహాలు తూర్పు అభి ముఖంగా ప్రతిష్టించబడుతుంటాయి. ఇక్కడ మాత్రం స్వామి ముఖం పశ్చిమాభిముఖంగా, తోకభాగాన గల సుదర్శనశాలి గ్రామం తూర్పుకు అభిముఖంగా వెలియడం చేత రెండు ధ్వజస్తంభాలున్నాయి. ఆలయంలోకి ప్రవేశించగానే ముందు కూర్మం తోక, ఆ తర్వాత కాస్త పశ్చిమంగా వెళ్ళితే ముఖం కనిపిస్తుంది. అనంతరం భోగ మంట పం, దానికి ఇరువైపులా పద్మనిధి, శంఖనిధి ఉన్నాయి.

భోగమంటపం తరువాత పుష్పాం జలి మంటపం, ఆస్థాన మంటపం ఉన్నాయి. ఈ క్షేత్రానికి పశ్చిమ భాగంలో కాలభైరవుడు, పూర్వభా గస్థితి వంశధారాది సంగమ ప్రదేశంలో కర్పూ రేశ్వరుడు, పశ్చిమ భాగస్థిత హరుకేశ్వర స్వామి కొలువై భక్తులను కరుణిస్తున్నారు. ఇది పంచలింగారాధ్య క్షేత్రం. అంటే ఐదుగురు శివులు క్షేత్రపాలకులై స్వామిని ఆరాధిస్తున్నా రు. వంశధార సాగర సంగమ ప్రాంతమైన కళింగపట్నంలో కర్పూరేశ్వరుడు, పడమట సింధూర పర్వతంపై (సింగుపురం కొండ) హటకేశ్వరుడు, దక్షిణాన నాగావళి తీరాన (శ్రీకాకుళ పట్టణం) రుద్ర కోటేశ్వరుడు, ఉత్తరాన పిప్పల (ఇప్పిలి) గ్రామంలో సుందరేశ్వరుడు శ్రీకూర్మ క్షేత్ర సుధాకుండ తీర్థంలో పాతాళ సిద్ధేశ్వరు డు ఉన్నారు. ఫాల్గుణ మాసంలో డోలోత్సవం ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతుంది. వైశాఖ సప్త మి-పూర్ణిమలోకల్యాణోత్సవం జరుగుతుంది.

ఇతర దర్శనీయ ప్రాంతాలు:
temp-godశాలిహుండం, దంతపురి వంటి బౌద్ధారామ క్షేత్రాలు, శ్రీముఖలింగం, దేశంలోనే మొదటి సూర్య దేవాలయంగా ప్రసిద్ధి పొందిన అరసవల్లి, సంగం వంటివి దగ్గర్లో ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి?
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళానికి రాష్ర్టం నలు మూలల నుంచి రైలు, బస్సు సౌకర్యాలున్నా యి. రైలు ద్వారా రావాలనుకునే వారు శ్రీకాకుళం రోడ్‌ (ఆముదాల వలస) వచ్చి అక్కడి నుంచి శ్రీకూర్మ క్షేత్రం చేరుకోవచ్చు.
పశ్చిమాభిముఖం ఎందుకంటే...
ఒకనాడు అటుగా వచ్చిన ఒక కిరాత స్ర్తీ కూర్మగుండములో దాహముతీర్చుకొని, శ్రీకూర్మనాథుని దర్శించుకొని, తన భర్త అయిన భిల్లురాజుకు ఈ విషయము తెలుపగా, ఆతను వచ్చి స్వామిని దర్శించుకొనెను.అక్కడకు వచ్చిన శ్వేతమహారాజు, నీ పూర్వపుణ్యమున శ్రీమన్నారాయణుడు, కూర్మరూపంలో నీకు దర్శనమిచ్చాడు అని చెప్పెను. భిల్లురాజు, తనవైపు ఎల్లప్పుడూ కరుణాదృష్టితో చూస్తూ ఉండమని స్వామిని వేడుకొనెను. అప్పటినుండి స్వామి పశ్చిమాభిముఖుడుగా తిరిగెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి