బొబ్బిలి వీణ....భళారే..
1757లో బొబ్బిలి యుద్ధం
జరిగిన తరువాత చిన్నాభిన్నమైన బొబ్బిలి సంస్థానం 1802 నాటికి కానీ
కుదుటపడలేదు. రాజా రాయుడప్పారావు, శ్వేతా చలపతి రంగారావు తదితరులు పరిపాలనా
పగ్గాలు చేపట్టిన తరువాతనే సంస్థానం మళ్లీ సంగీత, సాహిత్య సౌరభాలతో
గుభాళించింది. వీరి కాలంలోనే ముఖ్యంగా వైణిక సంప్రదాయం విరాజిల్లింది.
దాదాపు 300 సంవత్సరాల క్రితం ఆనాటి బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరు
సందర్శించారు. మైసూరు సంస్థాన దర్బార్లో వీణ కచేరి వినడం తటస్థించింది.
ఆనాడు వీణ తయారీలో మైసూరు వడ్రంగులు ప్రత్యేతను చూపించేవారట. అది గమనించిన
బొబ్బిలి రాజా తన సంస్థానంలోని ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి వీణల
తయారీలో మెళకువలు నేర్చుకోవాలని ప్రోత్సహించారు. అదే వీణ తయారీలో బొబ్బిలి
రాణించడానికి అంకురార్పణ అరుుంది.
1980లో బొబ్బిలి వీణకు జాతీయ అవార్డు లభించింది. సర్వసిద్ధి వీరన్న వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అప్పటి రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి నుంచి అవార్డు అందుకున్నారు. ఆనాడు మయూరి వీణను రూపొందించడం తన ఆశయంగా వీరన్న ప్రకటిం చారు. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బిలి వీణకు మురిసిపోయి సర్వసిద్ధి వెంకట రమణను వైట్హౌస్కు రావలసిందిగా ఆహ్వానించడం చెప్పుకోదగినది. ఈమని శంకర శాస్ర్తి వంటి ఎందరో వైణిక విద్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎంత ఘన చరిత్ర కలిగినా, ఇప్పుడు ఈ వృత్తిపని వారి మనుగడ ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నది. దీనికి కారణం వీణల తయారీకి కావలసిన పనస, సంపెంగ చెట్ల కలప సరిగ్గా లభించక పోవడం. అటవీ శాఖ ఆంక్షలు విధించడం కూడా మరొక కారణం.
ఇప్పుడు మామూలుగా వాయించే వీణలకన్నా, బహుమతులుగా ఇచ్చే చిన్న వీణలకు ఎంతో గిరాకీ ఉంది. ఏటా 300 వరకూ పెద్ద వీణలు బొబ్బిలిలో తయారవుతుంటాయి. విజయనగరం జిల్లా బొబ్బిలితోపాటు బాదంగి మండలం వాడాడలో కూడా వీణలను తయారు చేసే కుటుంబాలు సుమారు 45 వరకూ ఉన్నాయి. వీరు నెలకు 400 వరకూ గిఘ్ట వీణలను రూపొందిస్తు న్నారు. ఈ వీణలను లేపాక్షి సంస్థ మార్కెటింగ్ చేస్తోంది.గిఫ్ట్ వీణ తయారు చేయాలంటే రెండు రోజులు పడుతుంది. ఒక్కొక్క గిఫ్టు వీణపై 400 రూపాయిల వరకూ ఆదాయం వస్తుంది. ఇందులో వంద రూపాయిలు పెట్టుబడిగా పోతుంది. అలాగే పెద్ద వీణకు 4 వేల రూపాయిలు పెట్టుబడి పెడితే 5 వేల రూపాయిల వరకూ ఆదాయం వస్తుంది. విదేశాలకు ఈ వీణలు ఎగుమతి అవుతుంటాయి. ఏటా 14 లక్షల రూపాయిల వరకు టర్నోవర్ ఉంటుంది.
కాగా ఆ మధ్య బొబ్బిలి వీణలను టోకున కొనుగోలు చేసి హరిదాసులకు పంపిణీ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ కాంట్రాక్టును హస్తకళల కేంద్రం వారు చేపట్టి సుమారు 400 వీణలను తయారుచేయించి తిరుమలకు పంపించారు. కొన్నాళ్ల పాటు ఈ పనులు వీణ తయారీ కార్మికు లకు ఉపాధి కల్పించాయి. తంబురా ఆకారంలో ఉన్న ఈ వీణలను చూసిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది, అధికారులు ఎంతో ముచ్చటపడ్డారని కళాకారులు ఇప్పటికీ చెబుతుంటారు.మన రాష్ట్రానికి ఎలాంటి విశిష్ట అతిథి వచ్చినా వారికి ఇచ్చే విలువెన బహుమతి బొబ్బిలి వీణే. ఇలా అందుకున్న నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వీణ మలిచిన తీరుకు అబ్బురపడి ఇక్కడి కార్మికులను వైట్హౌస్కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇది బొబ్బిలికి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకుంటారు.
బొబ్బిలితో పాటు వివిధ గ్రామాల్లో వీణలు తయారు చేసి అమ్ముతున్న కళాకారులను ఒక్కచోటకు చేర్చి తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన 2001లో ప్రభుత్వానికి వచ్చింది. గొల్లపల్లిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ‘రాష్ట్ర హస్త కళల సంస్థ’ ద్వారా వీణలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. దీంతో సుమారు 200 మంది కార్మికులు ఈ కేంద్రంలో చేరారు. అయితే పనస కలప కొరతతో అందరికీ చేతినిండా పనిదొరికే పరిస్థితి కనిపించడంలేదు. కలపను అవసరమెనంత మేర అందించేందుకు వీలుగా పనస వనాలను పెంచేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదు. చేవగల కలప దొరకక పోవడంతో ఒడిశా తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో పెట్టుబడి ధర రెండింతల వుతోందని కార్మికులు వాపోతున్నారు. అదీగాక హస్తకళల సంస్థ కొనుగోలు చేస్తున్న ధరకు, బయటి మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఒక్కో వీణకు సుమారు రూ. 2 వేలు వరకు లాభం వస్తుందని ఆశపడే కార్మికులకు నష్టమే ఎదురవుతోంది.
పిండికొద్దీ రొట్టె చందంగా ఇక్కడి వీణలు ధరను బట్టి మోగుతాయి. స్వరాలు పలికించే వివిధ ఆకృతుల వీణలు రూ.9 వేల నుంచి రూ.16 వేల వరకు ఉన్నాయి. సంగీతంలో ప్రవేశం ఉన్నవారు మాత్రమే ముందుగా ఆర్డరిచ్చి వీటిని చేయించుకుంటారు. ఇక బహుమానాలకు ఇచ్చే వీణలు రూ.400 నుంచి రూ. 2 వేల మధ్య ధర పలుకుతాయి. తయాఆయనలో అంతర్లీనంగా రచయిత కూడా ఉన్నారు. ఇన్ని కళలను ఒక్కడే అభ్యసించడం ఆశ్చర్యకరమే. తాడేపల్లికి చెందిన శ్రీనివాసవర్మ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కొంతకాలం పనిచేశారు. మొదట్లో ఇంద్రజాలికునిగా కొన్ని ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ మెజీషియన్లు భయంకర్, పరుశురామ్ల పర్యవేక్షణలో శిక్షణ మొదలుపెట్టారు. చేయి తిరిగిన ఇంద్రజాలి కునిగా వారివద్ద అశేష అనుభవం గడించారు.
ఒక్కో ప్రదర్శనలో దాదాపు 40కి పైగా అద్భుతమైన ఐటమ్లు ప్రదర్శించేవారు శ్రీనివాసవర్మ. విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, కైకలూరు, భీమవరం వంటి ప్రాంతా లలో పలు ప్రదర్శనలు చేసి ప్రశంసలు పొందారు. ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలో మెజీషియన్ ప్రదర్శనలిచ్చే ఉద్యోగిగా కొంతకాలం చేశారు. అలాగే మౌంట్ ఒపేరా ఎమ్యూజింగ్ పార్కులో కూడా ఒక నెలరోజులు ఈయన చేసే సాహసోపేతమైన హర్రర్ ట్యూబ్లైట్ ఫీట్ (ట్యూబు లైట్ని నమిలి గాజుపెంకులుగా చేయడం), నోట్లో కిరోసిన్ పోసుకుని మంటలు ఊదుతూ భయోత్పాతం కలిగే రీతిలో ఆనందంగా నృత్యం చేయడం కేవలం అతనికే సాధ్యమయింది. ఒక్కో సారి ఈ సాహస కృత్యాల ఫీట్లో తన ఒంటికి గాయం అయినా అవన్నీ లెక్కచేయని తత్వం ఆయనది. తాను చేసే సాహసకృత్యాలలో ప్రమాదం పొంచి ఉన్నా ప్రేక్షకులు వినోదంతో అందించే ఉత్సాహపూరితమైన చప్పట్లే తనకు ప్రోత్సాహం ఇస్తాయంటారు.
త్వరలో హైదరాబాద్ త్యాగరాయగాన సభలో జరిగే కార్యక్రమంలో తన ప్రదర్శనలు ఇస్తానంటున్నారు శ్రీనివాసవర్మ. కేవలం కళనే నమ్ముకుని ఒంటిపై గాయాలను కూడా లెక్కచేయకుండా పొట్టకూటికోసం చేసే విన్యాసాలకు ఏనాటికైనా ప్రభుత్వ గుర్తింపు రాకుండా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు ఆయన.
రీ, అమర్చే గాజుపెట్టె ... ఇలా హంగులన్నింటికీ కలిపి ధర నిర్ణయిస్తారు.
(సూర్య నుంచి)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి