9, జులై 2013, మంగళవారం

ద్వారం వెంకటస్వామి నాయుడు

ద్వారం వెంకటస్వామి నాయుడు
ద్వారం వెంకటస్వామి నాయుడు 8 నవంబర్‌ 1893న దీపావళి పర్వదినాన బెంగళూరులో జన్మించారు. భారతదేశం గర్వించదగిన ఒక గొప్ప వయొలిన్‌ విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీ 1941లో ఇతనికి సంగీత కళానిధి అవార్డును ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది. ద్వారం బెంగళూరులో జన్మించినా... పెరిగింది మాత్రం విశాఖపట్నంలోనే. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం ‘మహారాజా సంగీత కళాశాల’లో వయొలిన్‌ ఆచార్యునిగా నియమితుడయ్యారు.

DWARAM11936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించడం విశేషం. వయొలిన్‌ వాయిద్యంతో ఒంటరి కచేరీలు ఇవ్వడం ఈయనతోనే ఆరంభం కావడం విశేషం. కాగా మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతిక శాస్త్ర పరిశోధనాశాల ఆడిటోరియంలో గొప్పగా ‘ద్వారం’ కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్‌ కళాకారుడు యెహుదీ మెనుహిన్‌ ద్వారం వారి వయొలీన్‌ సంగీతాన్ని జస్టిస్‌ పి.వి.రాజమన్నార్‌ ఇంటిలో విని ఎంతగానో ప్రశంసించారు.ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌ వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి.

కర్ణాటక సంగీతాన్ని సైతం వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి ద్వారం నాయుడే అంటారు అంతా.... సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశారు.. ‘తంబూరా విశిష్ట లక్షణాలు’ అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం వివిపించే తపస్సు అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఆయన తన శిష్యులకు చెప్పేవారు. ‘‘ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి’’ అని ద్వారం చెప్పే సూచనలను ఆయన శిష్యుపరమాణువులు తూ.చ.పాటించేవారు. చెన్నై మహానగరంలో ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు, విశాఖపట్నంలో ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం స్థాపించబడినాయి. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి.

ప్రపంచానికే ముద్దుపేరు
సంగీత కళాజగతికి ముద్దు పేరు ‘ద్వారం’. సంగీత కచేరీ వేదికపైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్‌ లేక ఫిడేల్‌) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని ‘మెలోడీ ఫీస్ట్‌’ గా మార్చడానికి కంకణం కట్టుకుని, కృషిసల్పిన ఘనత కేవలం ద్వారంనాయుడి గారి కళాజీవన ప్రస్థానంలో మరువలేని, ఎన్నటికీ మార్చలేని మైలురాళ్ళు. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు 8 నవంబర్‌ 1893న బెంగుళూరులో దీపావళి రోజున జన్మించడంతో సంగీత జగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి.

dwaram-uksతండ్రి వెంకటరాయుడు, ఆర్మీలో కమిషన్‌ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నానికి వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వయొలిన్‌ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడా ఈ వయొలిన్‌ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయంగా చేసుకున్న వెంకటస్వామినాయుడు తన అన్న వెంకటకృష్ణయ్య, తాత దగ్గర వయొలిన్‌ నేర్చుకుంటున్న సమయంలో, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు కూడ అన్నగారి వయొలిన్‌ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతంపై దృష్టి మరల్చవలసి వచ్చింది.

ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్ర్తి
గారి వద్ద నాయుడుగారు వయొలిన్‌ వాదనలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు. నాయుడుగారు 14వ ఏటనుంచే వయొలిన్‌తో తదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచందర్రావు ద్వారం వయొలిన్‌ ప్రతిభను గమనించి, డైమండ్‌ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారికి ‘ఫిడేల్‌ నాయుడు’ అని బిరుదుని యిచ్చారట. వయొలిన్‌నే ఫిడేల్‌ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్‌ అంటే ‘ఫిడులా’ అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్‌ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్‌, ఆంధ్రదేశపు సంగీత జగతితో మమేకమయింది.

వయొలిన్‌ పుట్టు పూర్వోత్తరాలు
Dwaram_Venkataswaసంగీత వాద్య పరికరమేఅయినా కొత్తగా అనిపించే వయొలిన్‌ 17వ శతాబ్దం మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్నాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, ‘వడివేలు అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వయొలిన్‌పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు(1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వయొలిన్‌ని తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం.

తర్వాత, 19వ శతాబ్దం ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో వయొలిన్‌తో సంపూర్ణంగా ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్‌ కృష్ణ అయ్యర్‌, గోవిందస్వామి పిళ్ళైలు రంగప్రవ్రేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కథనాలు. వీణ, వేణువు, నాదస్వరంతో వయొలిన్‌ను చేర్చిన ఘనత మాత్రం ద్వారం వెంకటస్వామినాయుడికే దక్కుతుంది. వాద్యసంగీతజగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరాల ఘనమైన వరసలో వయొలిన్‌ను నిలబెట్టిన ఘనత మాత్రం మన ‘ఫిడేల్‌ ద్వారం నాయుడే’ అన్నది మాత్రం సత్యం. వీటికి వయొలిన్‌ లేక వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడా నిరూపించిన నిష్ణాత విద్వాంసుడు ద్వారం నాయుడు.

ప్రముఖుల ప్రశంసలు
పాశ్చాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వయొలిన్‌ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణ స్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేస్తున్నట్లుగా చిత్రీకరించిన చిత్రం విశ్వవ్యాప్తంగా ఆయన అభిమానులను ఆశ్చర్యానందభరితుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది. అలాగే ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలు గుప్పించడం కూడా జరిగింది.
ద్వారం నాయుడుగారి వయొలిన్‌ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీందన్రాధ్‌ ఠాగూర్‌, అన్ని ముఖ్య కార్యక్రమాలను అనుకున్నవి మరచి పోరుు పూర్తి కచేరి వినడమే కాక, నాయుడు గారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోరుుంది. ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌కు సంబంధించిన గ్రామఫోన్‌ రికార్డ్‌, పక్కనే ఆయనపేరిట విడుదల చేసిన పోస్టల్‌ స్టాంప్‌.

మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ - సంగీత కళానిధి అవార్డు - 1941, సంగీత నాటక అకాడమీ - 1953, పద్మశ్రీ అవార్డు - 1957, భారతీయ తపాలా శాఖవారు 1993 లో ఆతని శతజయంతి సందర్భంగా తపాలా బిళ్ళ విడుదల చేశారు. రాజా లక్ష్మీ అవార్డు - 1992లో - శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్‌ వారిచే, శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టుకు బహూకరింపబడింది.

స్వాతి సోమనాథ్‌

సుమధుర స్వాతి నృత్యం
స్వాతి సోమనాథ్‌ ప్రఖ్యాత కూచిపూడి కళాకారిణి. ఎంత సంప్రదాయబద్ధంగా నర్తిస్తుందో అంతకన్నా ఆధునిక భావాలు కలిగిన మహిళ ఆమె. తాను రూపొందించే నృత్యరీతుల్లోనే కాదు, భావాలలోనూ ఆదర్శనీయంగా ఉంటారామె. వ్యక్తిగతంగా ఆమెకు ఎంతగా పేరుప్రఖ్యాతులు వచ్చాయో అంతకన్నా వివాదాలు మరింతగా ఆమెను చుట్టుకున్నారుు. ఆమె చేసే ప్రతి పని లోనూ ఒక సత్సంకల్పం ఉంటుంది. అందులో భగవత్కటాక్షం ఉంటుందని ఆమె నమ్ముతారు.

ప్రొఫైల్‌...
Untia
పూర్తిపేరు  : స్వాతి సోమనాథ్‌
జన్మస్థలం  : జార్ఖండ్‌
భర్త  : సి.హెచ్‌.రవి కుమార్‌   
           (దర్శకుడు)
వృత్తి    : కూచిపూడి  
                నృత్యకళాకారిణి
ప్రఖ్యాతి   : కామసూత్ర నృత్య 
                ప్రదర్శన
బిరుదు   : కళా రత్న

Un2స్వాతి సోమనాథ్‌ అంటే ఆమె నాన్నగారి పేరు కూడా ఆమెతో ఇమిడివుంటుంది. పుట్టింది బీహార్‌...పెరిగింది పశ్చిమబెంగాల్‌లో...స్థిరపడింది మాత్రం హైదరాబాద్‌ మహానగరంలో. స్వాతి పూర్వికుల స్వస్థలం శ్రీకాకుళం దూసి అగ్రహారం. వారిది సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. స్వాతి తండ్రి సోమనాథ్‌కి సంగీత సాహిత్యాలంటే ఎనలేని అభిమానం. అంతేస్థాయిలో జర్నలిజాన్ని కూడా ప్రోత్సహించేవారు. వృత్తిరీత్యా రైల్వే శాఖలో చేసేవారు. నృత్యప్రదర్శనలు ఏవీ వదిలేవారు కారు. కొన్నిసార్లు ప్రత్యేకంగా స్వాతిని కూడా నృత్యప్రదర్శనలకు తీసుకెళ్లేవారు. చిన్నవయసులో ఊహతెలిసి స్వాతి చూసిన ప్రదర్శన యామినీ కృష్ణమూర్తి ప్రదర్శన. ఆ తర్వాత ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో ఒంటరిగా నృత్యభంగిమలు ప్రాక్టీసు చేసేవారు స్వాతి.

ఆమె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రముఖ నృత్యకారిణి సుమతీ కౌశల్‌ వద్ద చేర్చారు.వ్యక్తిగతంగా స్వాతి సోమనాథ్‌ ఇచ్చిన కామసూత్ర నృత్యప్రదర్శనకు దేశవిదేశాలనుంచి ఎంతగానో ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో కొంత చెడు ప్రచారం కూడా జరిగింది. అది కేవలం కామసూత్ర అన్న పేరుతో ఆ నృత్యాన్ని ముడిపెట్టడమే అందుకు కారణం.
పేరుతెచ్చిన కామసూత్ర ప్రదర్శన..

Unawకామసూత్ర నృత్యానికి ఆమెకు మంచిపేరే వచ్చినా... సంప్రదాయనృత్యంగానే ఆమె భావించారు. ఆ నృత్యం చేసినందుకు స్వాతి తనని తాను ఏనాడూ విమర్శించుకోలేదు. అది కేవలం కొందరు పనిగట్టుకుని విషం చిమ్మారే తప్ప తన నృత్య భంగిమ లలో ఎటువంటి అసభ్యత కానరాదంటారు స్వాతి. శృంగారరసం లేని సాహిత్యమే లేదు. దాన్ని పక్కన పెట్టి మనమేమీ చేయలేం. సర్వజ్ఞశంకరలో సరస్వతీదేవి వచ్చి ఆది శంకరాచార్యు లను కామశాస్త్రం గురించి అడిగితే ఆయన ఆగిపోతారు. బదులేమీ చెప్పలేక పరకాయ ప్రవేశం చేసి, ఎంజాయ్‌ చేసి మళ్లీ వచ్చి సమాధానం చెబుతారు. కాబట్టి కామం, శృంగారం లేని కళ లేదు అంటారామె. భారతదేశం కళలకు పుట్టినిల్లు.యావత్‌ ప్రపంచానికి ఈ విషయాన్ని కొన్ని తరాలుగా మన కళాకారులు చాటుతున్నారు.

మన దేశంలో ప్రాంతాల వారిగా అనేక నృత్య కళలు ఉన్నాయి. వాటిని భావితరాలకు అందించే బాధ్యతను మనందరం గుర్తించాలి. నేటి తరం పిల్లలకు శాస్ర్తీయ నృత్యంలో ప్రావీణ్యం పొందేలా తల్లిదండ్రులు వారికి ప్రోత్సాహించాలని కోరారు.నృత్యకళను అభ్యసించిన విద్యార్థులు చదువుల్లోనూ రాణించగలరని పరిశోధనల్లో నిరూపితం అయ్యిందని తెలిపారు.పాశ్చాత్య నృత్యాలు కేవలం శారీరక భంగిమలపై కేంద్రీకృతమై ఉంటాయని.. భారతీయయ శాస్ర్తీయ నృత్యాలు శారీరక భంగిమలతో పాటు, ప్రేక్షకులతో మానసికంగా బంధాన్ని పెనవేసుకుంటా యని తెలిపారు.

వ్యక్తి గత జీవితం..
చిన్నప్పటినుంచే కళా ప్రదర్శనలు ఇచ్చేవారు ఆమె. ఆమె అందం చూసిన కొందరు నిర్మాతలు సినిమాలలోకి రావలసిందిగా ఆఫర్‌ ఇచ్చారు. కానీ సినిమాలపై ఆసక్తి లేక వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించారు. స్వాతి భర్త ప్రముఖ సినిమా దర్శకుడు. సిహెచ్‌.రవికుమార్‌. సామాన్యుడు, విక్టరీ చిత్రాలు తీశారాయన. దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నా భార్య కోరికమేరకు ఆమెను పెళ్లి తరువాత స్వాతీ రవికుమార్‌గా పేరు మార్చుకుంటానంటే.. అందరికీ తెలిసిన స్వాతీ సోమనాథ్‌గానే కంటిన్యూ చేయమన్నారు.

కేవలం శాస్త్ర సంగీత అంశాలేకాకుండా ఒక గృహిణిగానూ ఆమె సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆడవారు అన్ని రంగాలలో సమానంగా ఉండాలంటారు. నేటి మహిళలు రాజకీయాలలో కూడా రాణించాలని అవకాశం దొరికితే ఎటువంటి పదవిని అలంకరించడానికైనా వెనకడుగు వేయకూడదంటారు ఆమె. ఆమె చిన్నప్పటినుంచి కూడా చాలా కష్టపడి పైకొచ్చారు. తన పూర్వికుల స్వస్థలమైన శ్రీకాకుళంలో సంగీత,నృత్య కళాశాలను ప్రారంభించాలనేది ఆమె జీవిత సంకల్పం.

పౌరాణికాలంటే స్వాతికి చిన్నతనంనుంచి ఓ ప్రత్యేక అభిమానం. దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన స్వాతిసోమనాధ్‌ విద్యార్థులకు తన ఆశయాలతో స్థాపించిన ఓ స్కూల్లో శిక్షణనిస్తున్నారు. తాను క్లాసికల్‌ డాన్సర్‌గా ఈ రంగంలోకి కేవలం డబ్బు, కీర్తిప్రతిష్టలు సంపాదించడానికి మాత్రం రాలేదంటారు. అలా సంపాదించాలనుకుంటే ఈ పాటికి కోట్లే సంపాదించేదానిని కానీ ఫీజులే లేకుండా అత్యుత్సాహం ఉన్నవారికి తనవంతు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందంటారామె.

బారువా

గ్రామమే ఓ ఆలయం... బారువా
 
 
 
ఆ ఊళ్లో మీరు ఏ వీధికి వెళ్లినా ఓ దేవాలయం దర్శనమిస్తుంది. వీటికి తోడు సముద్ర తీరం, అం దమైన ప్రకృతి శోభలతో ఈ గ్రామం కళకళలాడుతుంటూంది. ఆ గ్రామం పేరే బారువా శ్రీకాకుళంలో ఉన్న ఈ చారిత్రక గ్రామంలో ఆలయాలలో ప్రసిద్ది చెందినవి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం, జనార్ధ నస్వామి ఆలయాలు. ప్రకృతి శోభతో అలరారే కవిటి అనే ప్రదేశం ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచింది.


బారువ సముద్రతీరం... 

ఉదయిస్తున్న సూర్యుడ్ని సుముద్ర తీరంలో నిలుచుని చూడటం మరుపురాని మహాద్భుతం. మహాభారతం, స్కంధపురాణం వంటి ధార్మిక గ్రంధాలలో బారువ తీరానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుష్కరమహోదయానికి ఈ స్థలం ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచింది. చివరిసారిగా ఆ శుభదిన 07 ఫిబ్రవరి 2008 నాడు వచ్చింది. ఆ సమయంలో మహోదయ పుష్కర స్నానాలు బారువ తీరం కిటకిటలాడు తుంది. తూర్పుకనుమల నుంచి మొదలై ఒరిస్సా, ఆంధ్రా రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ, బంగాళాఖాతములో కలుస్తున్న పవిత్ర మహేంద్ర తనయ నదీ సంగమ స్థలమే ఈ బారువ గ్రామం. ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాల నుండి అనేకమంది భక్తులు పుణ్యస్నానాలకు ఇక్కడకు వస్తారు. మాఘమాసం, శ్రవణ నక్షత్రం గురువారం ఉదయం 6.39 నిముషాలకు పుష్కర శుభఘడియలు ప్రారంభమవుతాయి.


చారిత్రక నేపథ్యం...
స్కంధపురాణం ఆధారంగా పలువురు సిద్ధాంతుల ప్రకారం... సుమారు 16 వేల సంవత్సరాల క్రితం తూర్పు కనుమలలో సంచరించిన పాండవులు ఒక అడవి జంతువుని వేటాడే ప్రయత్నములో విడిచిన బాణం సుదూరంలో వున్న ఒక గోవును తాకగా గోవు చనిపోయినది. గొహత్యా మహా పాపమని భావించి పాపవిమోచన కోసం ఆలోచించారు పాండవులు. ఈ నేపథ్యంలో మునీశ్వరుడు ప్రత్యక్షమై మృతి చెందిన ఆవుని సముద్రతీరానికి తీసుకెళ్లి కర్మకాండలు నిర్వహించాలని సలహా ఇవ్వడంతో ఆ గోవును సముద్ర తీరానికి తరలించి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరం అక్కడే వున్న పావన మహేంద్ర తనయ నదీ-సాగర సంగమ స్థలంలో పాండవులు స్నానాలు ఆచరించి, మోక్షం పొందేరని చారిత్రక కథనం.

Baru5పాండవులు సంగమ స్నానం చేసిన అనంతరం సమీపాన వున్న గ్రామానికి వెళ్లి అక్కడ 12 మంది బ్రాహ్మణుల సమక్షంలో యజ్ఞోపవీతం చేసి భారీ ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆ గ్రామాన్ని ‘బారాహరాపురం’ గా పిలిచేవారు, కాలక్రమేణా అది బారువగా మారినది. బారువ గ్రామం పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది. పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువస్తుండగా గ్రామానికి పశ్చిమ భాగములో ఆ గోవు నుండి ఒకటి తక్కువ కోటి రక్తపుచుక్కలు ఒకేచోట నేలపై పడినట్లు చారిత్రిక కథనం. అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుస్తున్నారు. ఈ ప్రదేశంలోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు.

దీనికి దక్షిణ వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయం, ఊరిమధ్యలో జగన్నాధస్వామి ఆలయం, వేణుగోపా లస్వామి ఆలయం, మహంకాళీ, కనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నాయి. నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడం సంప్రదాయంగా వస్తూ ఉంది.

జగన్నాథ ఆలయం

జగన్నాథ రథయాత్ర
ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో తీర పట్టణమైన పూరిలో ఉంది. జగన్నాథ్‌ అంటే విశ్వానికి దేవుడు అని అర్థం. శక్తి పీఠములలో ఇది 17వది. ఇక్కడ వేంచేసియున్న శ్రీ జగన్నాధస్వామి దర్శనం కోరి వచ్చినవారు జాతి, కుల, మత బేధాలు లేకుండా ఆరాధించి స్వామి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వారికి ఇది అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం. హిందూ తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన ఛార్‌ థాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర జనం లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. వైష్ణవులకు, రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైంది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్లు పూరిలోనే నివసించాడు.

శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్టించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. స్నాన యాత్రా సందర్భంగా పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు. రోజూవారి ఆరాధన సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమయినది జూన్‌లో జరిగే రథయాత్ర ఉత్సవం. పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాడ మాసంలో జరుగుతుంది.

ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు పత్రిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. విచిత్రం ఏమిటంటే రథయాత్ర ప్రారంభం అయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైన స్వామి వారికి సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఇది ఆచరిస్తున్నారు.

ఆకట్టుకునే రథాలు
రథయాతల్రో జగన్నాధుని రథాన్ని ‘నందిఘోష్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి అతి పెద్దవైన పదహారు చక్రాలు ఉంటాయి. బలభద్రుడి రథాన్ని ‘తాళ్‌ధ్వజ్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీనిని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని ‘దర్ప దళన’ అనే పేరుతో వ్యవహరిస్తారు.గర్భాలయంలో రత్న సింహాసనంపై కొలువై ఉన్న జగన్నాథుడు, ఆయన పెద్దసోదరుడు బల భద్రుడు, సోదరి దేవి సుభద్ర దేవతా మూర్తులను ఆలయ సింహద్వారం గుండా బయటకు తీసుకువచ్చి అలంకరించిన రథాలలో ఉంచి ఊరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వంతో దేవేరుల విగ్రహాలను దర్శిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైన శైలిలో మూడు రథాలు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటాయి. రథం కదిలే సమయంలో శంఖాలను, గంటను మోగిస్తారు. ప్రాచీన ఐరోపా నావికులు ఈ రథచక్రాల కింద ప్రమాదవశాత్తు పడడమో, మొక్కు కోసం ఆత్మబలిదానాల ఇవ్వడమో జరిగేదని కథలుగా చెబుతారు.

ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందన యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్‌ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు.

మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొం తమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధు ని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావ తారల్లోని కృష్ణుని ఆవతారానికి మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాల న్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్ధకంగా ఉంటుంది కూడా. అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయాన్ని చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్ధం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్‌ సముద్ర తీరంలో ఉన్నది. ఇంద్రద్యుమ్న తీర్ధం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.

వెళ్లడం ఇలా
మన రాష్ట్రం నుండి బయలుదేరి వెళ్లే వారికి ప్రత్యేకంగా తిరుపతి-పూరి ఎక్సె ప్రెస్‌లో ఎక్కి నేరుగా పూరి చేరవచ్చును. లేదా నేరుగా ఎన్నో రైళ్లు కలిగిన మద్రాసు-కలకత్తా మెయిను లైనులో మొదట భువనేశ్వర్‌ చేరి అక్కడి నుండి వసతిగా సౌకర్యంగా చూసుకుని రైలెక్కవచ్చు. అదీగాక అనేక బస్సులు కూడా ఉన్నాయి.

ఆలయ నిర్మాణ విశేషాలు
ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జెండా ఉంటుంది. జండా మీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్ని మైళ్ల దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది.

ప్రతీ ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నాన యాత్ర తర్వాత జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్‌గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణపక్షం వరకు ఉంటాయి. కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు. బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరులో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్‌ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు. భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజ వైద్యునితో చికిత్స చేయిస్తారు.

శాలిహుండం

శాలిహుండం
ఆంధ్రదేశంలో ఉన్న సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల్లో ఒకటి శాలి హుండం. శ్రీకాకుళం జిల్లా, గార మండలంలో... వంశధార నది ఒడ్డున ఉన్న బౌద్ద ఆరామాలు శిథిలమైన దేవాలయాలతో కనువిందు చేస్తూ ప్రకృతి రమణీయత కళ్ళకు కట్టే పర్యాటక స్థలం, అందమైన క్షేత్రం శాలిహుండం. పూర్వం శాలిహుండానికి శాలివాటిక (బియ్యపు ధాన్యాగారం) అన్న పేరు ఉండేది. కొందరు దీన్ని శల్యపేటిక (ఎముకల పెట్టె) అని కూడా పిలిచేవారు.
శాలిహుండం వంశధారానది దక్షిణపు ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పూర్వపు ఓడరేవు పట్టణమైన కళింగ పట్నానికి పడమర వైపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శాలిహుండంలోని శిథిలాలు చాలామటుకు చివరి బౌద్ధ కాలానికి చెందినవి. కొన్ని ఇటుక కట్టడాలు మాత్రం అంతకంటే పురాతనమైనవని భావిస్తున్నారు.
శాలిహుండం క్షేత్రాన్ని 1919లో తొలిసారిగా గిడుగు రామ్మూర్తి పంతులు కనుగొన్నాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో ఎ.హెచ్‌.లాంగ్‌హర్ట్‌‌స, టి.ఎన్‌.రామచంద్రన్‌, ఆర్‌.సుబ్రహ్మణ్యన్‌ తదితరులు త్రవ్వకాలు జరిపి నివేదిక ప్రచురించారు. త్రవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహం, అనేక శిల్పాలు బయటపడ్డాయి. క్రీపూ 2వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన, హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.