సంబరానికి సన్నద్ధమవుతున్న స్వేచ్ఛాపురం
రక్తధారతో అమ్మవారి జననం
ఇచ్ఛాపురం గ్రామదేవతగా పూజలందుకుంటోన్న శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారు రక్తధారతో జన్నించి నట్లు కథనం ప్రచారంలో వుంది. కొన్ని శతాభ్ధాలకు పూర్వమే అమ్మవారు ఈ గ్రామంలో వెలసినట్లు చెబుతున్నారు. పూర్వం ఈ ప్రాంతంలో కొన్నాళ్లు విపరీతమైన కరువుకాటకాలు ఏర్పడి, కలరా, మశూచి వ్యాధులు ప్రబలడంతో ప్రతీ వీధిలో చిన్నాలు, పెద్ద లు పెద్దసంఖ్యలో మృతిచెందేవారు. అప్పట్లో వేరేదారిలేక చాలా మంది ప్రజలు, గ్రామం, ఇళ్లు విడిచిపెట్టి ప్రాణభీతితో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు.
ఓ వ్యక్తి మాత్రం గ్రామం ఎడారిగా మారినప్పటికీ శ్రమను నమ్ముకుని దైవ భక్తితో అక్కడే వుండిపోయాడు. తనకున్న పొలాన్ని సేద్యం చేస్తుండగా ఒకనాడు నాగలి భూమిలో ఇరు క్కుంది. అతుక్కుపోయిన నాగలిని బయటకు తీసే ప్రయత్నించిన రైతు చెమటలు పట్టి భయాందోళనకు గురయ్యాడు. చుట్టుపక్కల వున్న రైతులను కేకలు వేసి సాయం చేయమని కోరగా వారు నాగలి ని బయటకు తీస్తుండగా చివరిభాగం నుండి రక్తం ధార గా చిమ్మడం మొదలుకావడంతో వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ వింత చూసేందుకు వచ్చిన గ్రామస్ధులు నాగలిపై చేసే సాహసం చేయలేక, ఎద్దులను ట్లు విప్పి పంపేసి నాగలిని అక్కడే విడిచిపెట్టి వెనుదిరిగారు. అంతా భగవంతునిపై భారం వేసి ఆ రాత్రి నిద్రపోయారు.
ఓ గ్రామపెద్దకు ఆ రాత్రి కలలో బంగారుకాంతితో మెరుస్తూ అలంకార భూషితై , శంఖు, చక్ర, గదాపద్మ , ఖడ్గ శూలపాశ దండములతో, సింహవాహినై చిరునవ్వుతో ఓ దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కరించింది. ‘పొలంలో రక్తం చిందించిన చోటనే, నేను శక్తిస్వరూపిణిగా, శ్రీ స్వేఛ్ఛావతి మాతగా ఆవిర్భవించి వున్నాని’ పలికింది. ‘ఇక మీరు భక్తిశ్రద్దలతో ఆరాధిస్తూ ప్రశాంతంగా, స్వేఛ్ఛగా, ఆరోగ్య సౌభాగ్యాలతో వెలగాలని దీవించి మాత అదృశ్యమైంది.
ఉదయాన్నే గ్రామపెద్ద లేచి కొంచెం భయం, ఆశ్చ ర్యం, ఆనందంతో విషయాన్ని గ్రామస్దులుకు తెలియ జేశాడు. దీంతో గ్రామస్దులు మేళతాళాలతో వెళ్లి పొలంలో నాగళి అతుకున్న చోట తవ్వగా అమ్మవారి విగ్రహాన్ని పోలిన రాయికి పెద్ద నాగలి గాటుతో రక్తంకారుతుండడం కన్పించింది. గ్రామస్దులు ఎంతో ధనవ్యయంతో చెక్కడపు శిలలతో, చక్కని శిల్పాలతో అక్కడే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఆ దేవికి స్వేచ్ఛావతిగా నామకరణం చేసి గ్రామదేవతగా ప్రతిష్ఠించారు. అక్కడ నుండి గ్రామానికి స్వేచ్ఛాపుర మని పిలవసాగారు. వాడుక లో నేటి ఇచ్ఛాఫురంగా పిలవబడుతోంది.
సంబరాల కోసం
సంబరాల నిర్వహణ కోసం గ్రామలు పలువురు గత ఏడాది భేటీ అయ్యారు. గత ఏడాదే నిర్వహించాలని భావించారు. కొన్ని అడ్డంకుల దృష్ట్యా 2013 కు వాయిదా వేశారు. నిధుల సమీకరణ కోసం తొలుత ప్రతీ దుకాణంలో హుండీలు ఏర్పాటు చేసి విరాళాల సేకరణకు నాంది పలికారు. సుమారు 11 నెలలు కాలంలో రూ. 7 లక్షల మేర విరాళాలు సమకూరాయి.
ఉప్పలవీధిలో అమ్మవారికి స్థానం
ఏప్రిల్ 22 రాత్రి అమ్మవారిని మంగళవాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా పట్టణంలోని ఉప్పలవీధిలో మండపం పై అమ్మవారిని వుంచుతారు. ఆ వీధికి చెందిన ‘నందికి’ వంశస్దులు అమ్మవారి కి కొన్ని తరా లుగా సేవలు చేస్తుండడంతో ఆ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆ వంశసు ్ధలకు చెందిన ఓ మహిళ కు అమ్మవారి ని తలపై ఊరేగించే అవకాశం కల్పిస్తారు.
సంబరాలతో మరింత అభివృద్ధి
వల్లంపాటి సుధీర్ కుమార్, ఉత్సవకమిటీప్రతినిధి
శాంతి స్వరూపిణి
దుర్గాగురుస్వామి,నిర్వాహక కమిటీ ప్రతినిధి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి